తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ రగడ... చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తమిళ ఆటగాళ్లెవరూ లేరన్న పీఎంకే ఎమ్మెల్యే
- తమిళ జట్టు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం
- తమిళ ప్రజల నుంచి వాణిజ్యపరంగా లాభాలు అందుకుంటున్నారని ఆరోపణ
తమిళనాడులో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం కనీసం ఒక్క తమిళ క్రికెటర్ ను కూడా ఎంపిక చేయలేదని వెంకటేశ్వరన్ మండిపడ్డారు. తమిళనాడు టీమ్ అని ప్రచారం చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ ప్రజల నుంచి వాణిజ్యపరమైన లాభాలు అందుకుంటుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై చర్చ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఇక, అన్నాడీఎంకే మాత్రం మరోలా స్పందించింది. ఎమ్మెల్యేలకు ఐపీఎల్ టికెట్లు సమకూర్చాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు ఉచితంగా పాసులు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.