ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పంది
- మహారాష్ట్ర గొండా జిల్లాల్లో వెలుగు చూసిన ఘటన
- అకస్మాత్తుగా బాలుడిపై పంది దాడి
- చిన్నారి పరిస్థితి విషమం
ఇటీవల కుక్కలు దాడి చేయడంతో ఢిల్లీకి చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. మార్చి 10న ఆనంద్ అనే బాలుడు(7) కుక్కల దాడిలో మరణించాడు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక మునుపే బాలుడి తమ్ముడు(5) కూడా కుక్కల దాడికి బలయ్యాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన అతడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. పిల్లాడు ఎంతకీ రాకపోవడంతో బయటకు వెళ్లి చూసిన కుటుంబసబ్యులకు అతడు రోడ్డుపై విగతజీవిగా కనిపించాడు.