ఆ అధికారుల వేళ్లు నరికేయాలి.. అప్పుడే మరోమారు తప్పుచేయకుండా ఉంటారు: సీపీఐ నారాయణ
- శాసన మండలి ఎన్నికలపై స్పందించిన నారాయణ
- పదో తరగతి కూడా చదువుకోని వారికి డిగ్రీ పాసైనట్టు ధ్రువపత్రాలు ఇచ్చారన్న నేత
- ఒక్క నియోజకవర్గంలోనే 15 వేల దొంగ ఓట్లు లెక్కతేలాయన్న నారాయణ
ఏపీ శాసన మండలి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు. ఒక్క నియోజకవర్గంలోనే 15 వేల దొంగనోట్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. నకిలీ ధ్రువపత్రాల కోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని నారాయణ ఆరోపించారు.