Pushpa: హైదరాబాద్ లో ‘పుష్ప2’ నైట్ షూటింగ్

  • ఘన విజయం సాధించిన పుష్ప తొలి పార్ట్
  • బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం
  • అదే స్థాయిలో రెండో పార్టును తెరకెక్కిస్తున్న సుకుమార్
Pusha2 Night shooting in Hyderabad

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ అఖండ విజయాన్ని సాధించింది. బన్నీని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. దక్షిణాదికి మించి హిందీలో తొలి పార్టుకు అపూర్వ స్పందన రావడంతో రెండో పార్టు ‘పుష్ప : ద రూల్’ను ఆ స్థాయిలోనే ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు దర్శకుడు సుకుమార్. పక్కా స్క్రిప్టు రెడీ చేసుకొని షూటింగ్ ను పట్టాలెక్కించాడు. డిసెంబర్‌‌లోనే షూటింగ్‌ మొదలుపెట్టిన సుకుమార్ ఇప్పటికే వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం రాత్రి పూట చిత్రీకరణ చేస్తున్నారు. 

హీరో అల్లు అర్జున్ తో పాటు ఇతర నటీనటులంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం విదేశాలకు వెళ్తుందని సమాచారం. తదుపరి షెడ్యూల్ ను సుకుమార్ బ్యాంకాక్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెండో పార్టుకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ కాగా, ఫవాద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండో పార్టులో హీరోయిన్ సాయి పల్లవి అతిథి పాత్రలో కనిపించనుంది.

More Telugu News