Ram Charan: ఈ వేదిక మీద తారక్ ను మిస్ అవుతున్నాను: రామ్ చరణ్

  • అమెరికాలో మరోసారి ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్
  • స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ప్రేక్షకులు
  • ఈ క్షణాల కోసం ఎంతో కష్టపడ్డానన్న రామ్ చరణ్
  • ఇప్పుడు తాను, ఎన్టీఆర్ ఎంతో సన్నిహితులమని వెల్లడి
Ram Charan says he misses Jr NTR in USA

ఎపిక్ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా RRRని మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ వేడుక‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ద‌ర్శ‌క దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. RRR ప్ర‌ద‌ర్శ‌న పూర్త‌యిన వెంట‌నే యూనిట్ స‌భ్యుల‌ను థియేటర్లో చ‌ప్ప‌ట్ల‌తో గౌర‌వించారు. స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.  

ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ ప్రేక్ష‌కులు చూపించే ప్రేమ‌, అభిమానుల ఆద‌ర‌ణే త‌న‌ను కెరీర్‌లో సుదీర్ఘ‌తీరాల‌కు న‌డిపిస్తుంద‌ని అన్నారు. "మిగిలిన వాళ్ల‌కు కూడా ఇలాగే ఉంటుందా?  లేకుంటే నాకు మాత్రం ఇలా ఉందో తెలియ‌దు. కానీ, నటుడిగా ఈ క్ష‌ణాల‌ను మ‌న‌స్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్ష‌ణాల కోస‌మే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ప్ర‌య‌త్నం. ఇలాంటి స్పంద‌నే నేను కోరుకున్నాను. 

ఇంత‌గా ఆద‌రాభిమానాలు చూపిస్తున్నందుకు, ప్ర‌శంసిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇంత గొప్ప చిత్రంలో న‌న్ను భాగం చేసిన మా ద‌ర్శ‌కులు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి గారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను" అని రామ్ చరణ్ అన్నారు. 

"సింపుల్‌గా చెప్పాలంటే, మ‌గ‌ధీర స‌మయంలో నన్ను నేను విద్యార్థిగానే భావించాను. ట్రిపుల్ ఆర్ స‌మ‌యంలోనూ అలాగే అనుకున్నాను. ఇదేదో నేను స‌ర‌దా కోసం చెబుతున్న మాట కాదు. రాజ‌మౌళి గారు నాకు ప్రిన్సిప‌ల్, టీచ‌ర్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురువు లాంటి వారు. 

ఆయ‌న్ను క‌లిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించిన విషయాలు చాలా తెలుసుకుంటాను. చాలా స‌మాచారం తెలుసుకున్న‌ట్టు భావిస్తాను. ఆయనతో మాట్లాడితే మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. మ‌రో ప‌దేళ్లకు సరిపడా జ్ఞానం మనకు లభిస్తుంది`` అని అన్నారు. 

ఎన్టీఆర్ గురించి చ‌ర‌ణ్‌ మాట్లాడుతూ "ఇప్పుడు నేను, తార‌క్ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకు ట్రిపుల్ ఆర్‌కి ధ‌న్య‌వాదాలు. ట్రిపుల్ ఆర్ వ‌ల్ల మేం త‌ర‌చూ క‌లిసే వాళ్లం. చాలా స‌న్నిహితుల‌మ‌య్యాం. మ‌మ్మ‌ల్ని క‌ల‌పాల‌నే ఆలోచ‌న రాజ‌మౌళి గారికి క‌లిగిన‌ట్టుంది. అందుకే మ‌మ్మ‌ల్ని ఇద్ద‌రినీ ట్రిపుల్ ఆర్ కోసం తీసుకున్నారు. 

ట్రిపుల్ ఆర్‌లో తార‌క్ న‌టించ‌డం వ‌ల్ల సోద‌ర‌ భావాన్ని చూపించ‌డం తేలికైంది. త‌న‌తో క‌లివిడిగా ఉండ‌గ‌లిగాను" అని అన్నారు. తార‌క్‌ని ఆ వేదిక మీద మిస్ అవుతున్నానని రామ్ చరణ్ విచారం వ్యక్తం చేశారు.

More Telugu News