Allu Arjun: బ్యాంకాక్ లోని ఫారెస్టులో నెల రోజులపాటు మకాం పెడుతున్న 'పుష్ప 2' టీమ్!

  • వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన 'పుష్ప 2'
  • బ్యాంకాక్ లో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేసిన టీమ్
  • హైలైట్ గా నిలవనున్న సింహంతో బన్నీ ఫైట్
  • కొత్తగా మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్న సుకుమార్ 
Pushpa 2 movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలాంటి ఈ సినిమా ప్రస్తుతం సీక్వెల్ షూటింగు జరువుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ లో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. 

త్వరలో ఈ సినిమా టీమ్ 'బ్యాంకాక్' వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి ఫారెస్టు ఏరియాలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. నెలరోజుల పాటు అక్కడే మకాం పెట్టి ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నట్టుగా చెబుతున్నారు. 

బ్యాంకాక్ ఫారెస్టులో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యంగా సింహంతో బన్నీ ఫైట్ ఎపిసోడ్ ను డిజైన్ చేసిన తీరు ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, కొత్తగా మరికొంతమంది స్టార్స్ కూడా జాయిన్ కానున్నారని అంటున్నారు.   

More Telugu News