Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారం!

  • పాల్ఘర్ జిల్లాలో ఘటన
  • బాలికకు మాయమాటలు చెప్పి పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లిన బాలుడు
  • అక్కడ మరో ఏడుగురితో కలిసి అత్యాచారం
  • రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అఘాయిత్యం
8 Men Gangrape 16 Year Old Girl In Palghar

మహారాష్ట్రలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి మరో ఏడుగురు నిందితులు వచ్చారు. అనంతరం అందరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News