పెనుమాకలో టీడీపీ ‘బాదుడే బాదుడు’.. ఆర్కే ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోయారన్న లోకేశ్

TDP Leader Lokesh slams Mangalagiri MLA RK
  • ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం మోపిన పన్నుల భారం గురించి వివరించిన లోకేశ్
  • ఓడిపోయిన తాను 12 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నానన్న లోకేశ్
  • గెలిచిన ఆర్కే పత్తా లేకుండా పోయారన్న టీడీపీ నేత
తాను గెలిస్తే ఏడాదిలో ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ప్రజలు నమ్మలేదని, లోకేశ్ వస్తే ఇళ్లు కూల్చేస్తాడన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని పెనుమాకలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కార్యక్రమంలో  భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలపై ప్రభుత్వం మోపిన పన్నుల భారాన్ని వివరించారు. అలాగే, ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  
 
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఆర్కే ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.  ఇళ్ల పట్టాలు ఇస్తానన్న వ్యక్తి గెలిచిన తర్వాత పత్తా లేకుండా పోయారని, పైపెచ్చు పేదల ఇళ్లు కూల్చేసి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. తాను ఓడిపోయినా 12 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ఓడిపోయిన తాను ఇన్ని చేస్తుంటే గెలిస్తే ఇంకెన్ని చేస్తానో ఆలోచించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే అటవీ భూముల్లో ఉంటున్న వారికి ఏడాదిలోనే బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కరెంటు బిల్లు  సాకుగా చూపి పెన్షన్లు కట్ చేయడం దారుణమని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, విజయసాయిరెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Go Back to Shorts
Nara Lokesh
Mangalagiri
MLA RK
Jagan
Vijay Sai Reddy

More Telugu News