Ramiz Raja: భారత జర్నలిస్టు నుంచి ఫోన్ లాక్కునేందుకు యత్నించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా

  • ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి
  • మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన రమీజ్ రాజా
  • పాకిస్థాన్ ఓటమిపై ప్రశ్నించిన రిపోర్టర్
  • నువ్వు భారత్ నుంచి వచ్చావా? అని అడిగిన రమీజ్ రాజా
  • భారత్ అభిమానులు సంతోషించి ఉంటారని వ్యాఖ్యలు
PCB Chairman gets anger towards an Indian journalist after Pakistan lose in Asia Cup final

ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోవడం ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ మ్యాచ్ ను రమీజ్ రాజా ప్రత్యక్షంగా తిలకించాడు. శ్రీలంక చేతిలో పాక్ చావుదెబ్బతినడం రమీజ్ రాజాకు మింగుడుపడలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ భారత జర్నలిస్టు రమీజ్ రాజా స్పందన కోరాడు. పాకిస్థాన్ ఓటమిపై ఏమంటారని అడిగాడు. 

అప్పటికే తీవ్ర అసహనంలో ఉన్న రమీజ్ రాజాకు ఈ ప్రశ్నతో పుండుమీద కారం చల్లినట్టయింది. సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రికేయుడి నుంచి ఫోన్ లాగేసుకునేందుకు ప్రయత్నించాడు. 'నువ్వు భారత్ నుంచి వచ్చావా? ఈ ఫైనల్ మ్యాచ్ చూసి భారత అభిమానులు సంతోషిస్తారనుకుంటా' అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. 

'సార్... నేను మామూలుగానే అడుగుతున్నాను' అని ఆ జర్నలిస్టు వివరణ ఇచ్చినా, సమాధానమిచ్చేందుకు రమీజ్ రాజా  ఇష్టపడలేదు. టోర్నీలో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆటతీరుపై స్పందించాలని ఓ మహిళా జర్నలిస్టు కోరగా, ఎంతో చక్కగా ఆడాడని రమీజ్ రాజా బదులిచ్చాడు.

More Telugu News