Allu Arjun: 'పుష్ప 2' ఎలా ఉంటుందనేది ఎవరూ గెస్ చేయలేరు: దేవిశ్రీ

  • సంచలనాన్ని సృష్టించిన 'పుష్ప'
  • మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన దేవిశ్రీ 
  • సీక్వెల్ కోసం రెడీ అవుతున్న ట్యూన్స్ 
  • కథ అద్భుతమంటూ సుకుమార్ పై ప్రశంసలు
Pushpa 2 movie update

సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే, పాటలు ఒక రేంజ్ లో ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్లిద్దరూ ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 'పుష్ప' సినిమా కోసం దేవిశ్రీ అందించిన పాటలు, ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో సందడి చేశాయనేది అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు 'పుష్ప 2' కోసం కసరత్తు జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి దేవిశ్రీ స్పందిస్తూ, 'పుష్ప 2' కోసం ఇంతవరకూ మూడు పాటలను ట్యూన్ చేశాను. ప్రతి పాట కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సుకుమార్ కి ఈ ట్యూన్స్ విపరీతంగా నచ్చాయి. ఇక ఆయన స్క్రిప్ట్ లాక్ చేయడం జరిగిపోయింది. ఈ కథ ఎలా ఉంటుందనేది ఎవరూ గెస్ చేయలేరు" అంటూ చెప్పుకొచ్చాడు. 

దేవిశ్రీ మాటలు ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిని పుష్ప టచ్ చేయడం వలన, అదే రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ .. బాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ ను తీసుకుంటున్నారు. సమంత కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

More Telugu News