Telangana: తెలంగాణలో మరో 528 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 24,968 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 327 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 485 మంది
  • ఇంకా 5,189 మందికి చికిత్స
Telangana corona report

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,968 శాంపిల్స్ పరీక్షించగా, 528 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఒక్క హైదరాబాదు జిల్లాలోనే అత్యధికంగా 327 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39 కేసులను గుర్తించారు. అదే సమయంలో 485 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,05,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,96,365 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,189 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

More Telugu News