టీజీ వెంకటేశ్కు ఊరట... కబ్జా కేసు నుంచి ఎంపీ పేరు తొలగింపు
- జూబ్లీ హిల్స్లో భూకబ్జా కేసులో టీజీ వెంకటేశ్ పేరు
- టీజీ సమీప బంధువు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో కబ్జా యత్నం
- ఈ కేసుతో తనకు సంబంధం లేదని ప్రకటించిన టీజీ వెంకటేశ్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను తీసుకుని వ్యక్తి వచ్చిన టీజీ వెంకటేశ్ సమీప బంధువు టీజీ విశ్వ ప్రసాద్ అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించిన పోలీసులు... అరెస్టైన నిందితులు చెప్పిన వివరాల మేరకు టీజీ వెంకటేశ్ పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీజీ వెంకటేశ్ ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా కూడా పోలీసులు ఆయన పేరును కేసు నుంచి తొలగించలేదు. తాజాగా ఈ కేసులో మరింత మేర క్లారిటీ తెచ్చుకున్న పోలీసులు టీజీ వెంకటేశ్ పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు.