రెండెకరాల భూమి, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరిన సత్యంబాబు!

Sathyam Babu requests district collector for compensation
షార్ట్స్‌లో చూడండి
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు నుంచి సత్యంబాబు నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సత్యంబాబు చాలా కాలంపాటు జైలు జీవితాన్ని గడిపాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో తనకు 2 ఎకరాల సాగు భూమి, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కోరాడు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినందున పరిహారం ఇవ్వాలని ఈ రోజు స్పందన కార్యక్రమంలో విన్నవించాడు.

 చేయని నేరానికి తొమ్మిదేళ్లు జైలు శిక్షను అనుభవించానని... ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆయేషా మీరా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. ఖర్చుల కింద సత్యంబాబుకు రూ. లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Go Back to Shorts
Sathyam Babu
Ayesha Meera
Compensation

More Telugu News