అండర్ 19 ప్రపంచకప్: సెమీస్కు యువ భారత్
- డిఫెండింగ్ చాంపియన్ బంగ్లా చిత్తు
- బంతితో బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించిన భారత్
- 5 వికెట్ల తేడాతో విజయం
అనంతరం 112 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 30.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రఘువంశీ 44, షేక్ రషీద్ 26, కెప్టెన్ యశ్ ధుల్ 26 (నాటౌట్) పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిపన్ మండల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తంజీమ్ హసన్ సకీబ్కు ఒక వికెట్ దక్కింది. మూడు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టిన రవికుమార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.