Akhanda: బాలీవుడ్ కు పాకిన 'అఖండ' క్రేజ్.. రీమేక్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు స్టార్ హీరోలు!

  • ఘన విజయం సాధించిన 'అఖండ'
  • బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న నిర్మాతలు
  • ఈ సినిమా కోసం పోటీ పడుతున్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్
Bollywood interested in Akhanda movie

బాలయ్య తాజా చిత్రం 'అఖండ' ఘన విజయాన్ని సాధించింది. కరోనాతో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు పాత ఊపును తీసుకొచ్చింది. బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఈ చిత్రం... బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓటీటీలో కూడా ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయింది. ఓటీటీలో సైతం 'అఖండ' దూసుకుపోతోంది.

మరోవైపు ఈ సినిమా క్రేజ్ బాలీవుడ్ కు పాకింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు అఖండ క్యారెక్టర్ కు ఈ ఇద్దరు హీరోల్లో ఎవరైనా సరే న్యాయం చేయగలుగుతారని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి.

More Telugu News