Balakrishna: భారీ యాక్షన్ ఎపిసోడ్ తో రంగంలోకి దిగుతున్న బాలయ్య!

  • రాయలసీమ నేపథ్యంలో బాలయ్య సినిమా
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • కథానాయికగా శ్రుతిహాసన్
  • ముఖ్య పాత్రల్లో అర్జున్, వరలక్ష్మి శరత్ కుమార్
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'అఖండ' ఇంకా తన దూకుడు చూపుతూనే ఉంది. ఈ సినిమాతో ఆ తరువాత ఆయన చేయనున్న గోపీచంద్ మలినేని సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అందువలన ఆయన స్క్రిప్ట్ పై మరింతగా కసరత్తు చేసి రంగంలోకి దిగుతున్నాడు. నిజానికి ఈ నెల 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావలసి ఉంది.

కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఆలస్యమైంది. దీంతో వచ్చేనెల 12వ తేదీ నుంచి ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ తదితరులపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఆ తరువాత లాంగ్ షెడ్యూల్ ను 'కడప' పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా కథా నేపథ్యం అంతా కూడా రాయలసీమలో నడుస్తుంది. 'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News