Andhra Pradesh: ఏపీలో మరో 162 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 31,743 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
  • ఇంకా 1,049 మందికి చికిత్స
AP Corona details report

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,743 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కొత్త కేసుల్ని గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 22, చిత్తూరు జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు వెల్లడైంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు.

అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,308 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,049 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 14,492 మంది మరణించారు.

More Telugu News