Andhra Pradesh: ఏపీలో మరో 142 మందికి కొవిడ్ పాజిటివ్

  • గత 24 గంటల్లో 32,793 కరోనా టెస్టులు
  • గుంటూరు జిల్లాలో 28 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 1,989 మందికి చికిత్స
AP Covid daily report

ఏపీలో గడచిన 24 గంటల్లో 32,793 శాంపిల్స్ పరీక్షించగా, 142 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 28, తూర్పు గోదావరి జిల్లాలో 21, అనంతపురం జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వెల్లడైంది.

అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,552 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,989 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,462కి పెరిగింది.

More Telugu News