Andhra Pradesh: ఏపీ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు
  • 150 మందికి పాజిటివ్
  • గుంటూరు జిల్లాలో 28 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 3,760 మందికి చికిత్స
Corona details in Andhra Pradesh

ఏపీలో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు నిర్వహించగా, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 24, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

అదే సమయంలో 217 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,555 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,760 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,391కి పెరిగింది.

More Telugu News