Rana Daggubati: "ఎవడు నీకు చెప్పింది?" అంటూ ఓ వెబ్ సైట్ పై రానా ఆగ్రహం

  • రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం'
  • మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ కథనం
  • సోషల్ మీడియాలో స్పందించిన రానా
  • నీ సోది... అంటూ ట్వీట్
Rana fires on a website

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, సినిమా నుంచి సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ ఓ వెబ్ సైట్లో కథనం వచ్చింది. దీనిపై హీరో రానా తీవ్రంగా స్పందించాడు. "ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది!" అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రానా స్పందనతో ఆ వెబ్ సైట్ వెనక్కి తగ్గింది. వెంటనే తన కథనాన్ని తొలగించింది. కరోనా సంక్షోభం కారణంగా 'విరాటపర్వం' విడుదల గతంలో వాయిదాపడింది. ఈ సినిమా డిసెంబరులో వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News