Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే

  • విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపు
  • అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ
  • ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు
Decisions of AP cabenet meeting

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే:

  • స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
  • జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
  • రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
  • పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
  • జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
  • వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు ఆమోదం
  • రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
  • సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
  • ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు (యూనిట్ రూ. 2.49 చొప్పున) ప్రతిపాదనకు ఆమోదం
  • బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం
  • విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం

More Telugu News