Judge: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం

  • దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
  • నోటిఫై చేసిన కేంద్ర న్యాయశాఖ
  • గత నెల 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
  • ఏపీ హైకోర్టు జడ్జిగా అమానుల్లా
  • తెలంగాణ హైకోర్టుకు ఉజ్జల్
Judges for AP and Telangana high courts

దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర న్యాయశాఖ నోటిఫై చేసింది. హైకోర్టు జడ్జిల బదిలీపై సెప్టెంబరు 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కూడా న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ను నియమించారు. తెలంగాణ హైకోర్టు జడ్జి రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు జడ్జిగా ఆషానుద్దీన్ అమానుల్లాను నియమించారు.

More Telugu News