Crime News: హైద‌రాబాద్‌లో తీవ్ర‌ క‌ల‌క‌లం.. ప‌క్కింటి అబ్బాయి ఇంట్లో బాలిక మృత‌దేహం ల‌భ్యం.. నిందితుడి అంతు చూస్తామంటోన్న స్థానికులు

  • సైదాబాద్ లో ఘ‌ట‌న‌
  • నిన్న అదృశ్య‌మైన ఆరేళ్ల బాలిక‌
  • రాజు అనే యువ‌కుడు హ‌త్యాచారం చేశాడంటోన్న స్థానికులు
  • చంపాపేట్ ర‌హ‌దారిపై ధ‌ర్నా.. పోలీసుల‌తో వాగ్వివాదం
ruckus ar champapet

హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌ లో తీవ్ర‌ క‌ల‌క‌లం చెల‌రేగింది. నిన్న సింగ‌రేణి కాల‌నీలోని ఆరేళ్ల బాలిక అదృశ్య‌మైంది. ఆమె కోసం వెత‌క‌గా చివ‌ర‌కు ప‌క్కింట్లో నివ‌సించే రాజు అనే యువ‌కుడి ఇంట్లో ఆమె మృత‌దేహం లభ్య‌మైంది. అయితే, అప్ప‌టికే రాజు ఆ ఇల్లు వ‌దిలి పారిపోయాడు.

బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు రాజును ప‌ట్టుకున్నాక త‌మ‌కు అప్ప‌గించాల‌ని, అత‌డి అంతు చూస్తామ‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప‌రారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

అదే సమయంలో సింగ‌రేణి కాల‌నీలో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ సింగ‌రేణి కాల‌నీ వాసులు చంపాపేట్ ర‌హ‌దారిపైకి వ‌చ్చి ధ‌ర్నాకు దిగారు. దీంతో పోలీసులు, కాల‌నీ వాసుల‌కు మ‌ధ్య వాగ్వివాదం కొన‌సాగుతోంది. మ‌రోవైపు, పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి బాలిక‌ మృత‌దేహాన్ని త‌ర‌లించారు.

More Telugu News