Nagarjuna: లైన్లోకి వచ్చేసిన 'బంగార్రాజు'

  • పట్టాలెక్కుతున్న 'బంగార్రాజు'
  • నాగ్ సరసన మళ్లీ రమ్యకృష్ణ
  • చైతూ జోడిగా కృతి శెట్టి
  • సంక్రాంత్రికి రిలీజ్ చేసే ఆలోచన    
Bangarraju shooting will start soon

నాగార్జున హీరోగా 'బంగార్రాజు' రూపొందనున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఒక వైపున నాగ్ .. మరో వైపున చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన, స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ పట్టాలెక్కలేకపోయింది. అలాంటి ఈ ప్రాజెక్టులో ఇటీవలే కదలిక మొదలైంది.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన 'బంగార్రాజు'ను కూడా లైన్లో పెట్టేశారు. తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్న ఆయన, ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఆ దిశగా చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారట. ఆ సెట్లో నాగార్జున - రమ్యకృష్ణ కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టి సందడి చేయనుందని అంటున్నారు. సాధ్యమైనంతవరకూ 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  

More Telugu News