Andhra Pradesh: ఏపీలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్‌ఈసీ రెడీ.. నోటిఫికేషన్ జారీ

  • రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నిక
  • 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం
  • అదే రోజున ఏలూరులో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు
Election for deputy mayors on 30th july

ఏపీలో రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్లను నియమించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఎస్ఈసీ స్పందించింది. రాష్ట్రంలోని 11 మునిసిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలలో రెండో వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి ఎన్నిక కోసం ఈ నెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

30న నిర్వహించనున్న సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులను కోరారు. అలాగే, ఏలూరు కార్పొరేషన్‌లోనూ ఈ నెల 30నే మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ పేర్కొంది.

More Telugu News