AP High Court: నీలం సాహ్నీ నియామకంపై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు

  • ఎస్ఈసీగా సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్
  • హైకోర్టులో నేడు విచారణ
  • మరికొంత సమయం కోరిన పిటిషనర్
  • అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు
High Court takes up a petition against Neelam Sahni appointments as SEC

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది.  విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ నియామక జాబితాలో ప్రభుత్వం పంపిన 3 పేర్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. మరిన్ని అదనపు వివరాలు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, ఈ దశలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News