ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం...11 మంది దుర్మరణం
- కైరో నుంచి మన్సోరా వెళ్తున్న రైలు
- క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు
- గత నెలలో జరిగిన ప్రమాదంలో 32 మంది మృత్యువాత
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సహాయక చర్యల్లో 50కిపైగా అంబులెన్స్లు పాలుపంచుకున్నట్టు పేర్కొంది. కాగా, క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. తాజా ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, గత నెలల్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు.