Rahul: అలిపిరి మెట్ల మార్గంలో అపశ్రుతి... గుండెపోటుతో భక్తుడి మృతి

  • శ్రీవారి దర్శనం కోసం వచ్చిన రాహుల్
  • రాహుల్ స్వస్థలం హైదరాబాద్
  • బీటెక్ చదువుతున్న యువకుడు 
  • మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లే ప్రయత్నం
  • గాలిగోపురం వద్ద గుండెపోటుకు గురైన రాహుల్
Devotee dies of heart attack in Alipiri

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే అలిపిరిలో ఓ భక్తుడు గుండెపోటుతో మరణించాడు. దాంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి తిరుమల శ్రీవారి సందర్శన నిమిత్తం తిరుపతి చేరుకున్నాడు. అయితే మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో అలిపిరి మెట్ల మార్గంలోని గాలిగోపురం వద్దకు చేరుకోగానే గుండెపోటుకు గురయ్యాడు. దాంతో ఇతర భక్తులు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే రాహుల్ మరణించినట్టు తెలుస్తోంది. కాగా, ఆ విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News