East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో జనాన్ని వణికించిన వింత జంతువు.. బావిలో గుర్తింపు!

  • పశువులను చంపేస్తున్న వింత జంతువు
  • దగ్గరికెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు
  • అటవీ అధికారులకు సమాచారం
villagers find strange animal in a well in east godavari

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, కపిలేశ్వరపురంలో పశువులను చంపేస్తూ కలకలం రేపిన వింత జంతువు ఎట్టకేలకు చిక్కింది. వింత జంతువును చూసిన రైతులు హడలిపోయారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో జనం భయంతో వణికిపోయారు. ఎట్టకేలకు ఈ వింతజీవి ఆలమూరు మండలం పెనికేరులోని ఓ బావిలో ఉన్నట్టు గుర్తించారు.  దానిని కనుగొన్నప్పటికీ ఆ జంతువు వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆ జంతువును బావి నుంచి వెలికి తీస్తే తప్ప జనాన్ని భయపెడుతున్న ఆ జంతువు ఏంటనే మిస్టరీ వీడేలా కనిపించడం లేదు.

More Telugu News