CSK: ఎంఎస్ ధోనీపై తమిళ తంబీల ఆగ్రహం!

  • ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున సీఎస్కే
  • ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓటములు
  • ధోనీపై సీఎస్కే అభిమానుల విమర్శలు
CSK Fans Trolling on MS Dhoni

ప్రస్తుత సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్ లలో ముందు స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, పోటీలు ప్రారంభమైన వారం రోజుల తరువాత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తమ టీమ్ ను, ముఖ్యంగా ధోనీని విపరీతంగా ట్రోల్ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ పై 15 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించడంతో చెన్నై జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. సగం జట్లు మూడు మ్యాచ్ లను పూర్తి చేయగా, మిగతా జట్లు రెండు మ్యాచ్ లను ఆడాయి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన చెన్నై జట్టు, ఆపై ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ లేకుంటే చెన్నై పరిస్థితి ఇదేనని, పాయింట్ల టేబుల్ లో జట్టు చివరి స్థానంలో ఉండటానికి ధోనీయే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

టీమ్ వైఫల్యంపై పలు మీమ్స్ కూడా సృష్టించగా, అవి వైరల్ అవుతున్నాయి. 2020 కరోనాను తెచ్చినట్టే, చెన్నై జట్టుకు ఘోర వైఫల్యాన్ని కూడా మోసుకుని వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. కాగా, తాను ఆడిన మూడు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ పై గెలిచిన ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఆపై ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ లలో ధోనీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడంపైనా విమర్శలు చెలరేగాయి. అయితే, మ్యాచ్ పరిస్థితిని బట్టి తన ఆలోచన మారుతుందని, తమ టీమ్ లో పలువురికి కరోనా సోకడం, క్వారంటైన్ లో ఉండాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్ లేకపోయిందని, మ్యాచ్ లు ఇంకా ఎన్నో ఆడాల్సి వున్నందున తదుపరి గేమ్ లలో సత్తా చాటుతామని ధోనీ సమర్ధించుకున్నా, విమర్శలు మాత్రం ఆగడం లేదు.

More Telugu News