Bandla Ganesh: వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు... జాగ్రత్త మిత్రమా!: బండ్ల గణేశ్

  • మరోసారి బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్
  • బలమైన సందేశంతో కూడిన వ్యాఖ్యలు
  • చేసిన మంచిని మర్చిపోయే సమాజం ఇది అంటూ హితోక్తి
Bandla Ganesh tweets again with a strong message

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కొన్నిరోజులుగా ట్విట్టర్ లో పదునైన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. ఆయన తన ట్వీట్లలో ఎవరి పేర్లను ప్రత్యేకించి పేర్కొనకపోయినా, వాటి వెనుక బలమైన సందేశం ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా చేసిన ట్వీట్ లోనూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. "చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది" అంటూ స్పందించారు. "జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News