Tamilnadu: ‘కరోనా’ ఎఫెక్ట్​.. తమిళనాడులో విద్యా సంస్థలతో పాటు ఇవి కూడా బంద్​

  • థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూపార్క్ లకు వర్తింపు
  • క్లబ్బులు, బార్ లు, రిసార్ట్స్ కూడా
  • ఈ మేరకు సీఎం పళనిస్వామి ఆదేశాలు 
Tamilnadu government orders to close educational institutions till 31st March

‘కరోనా’ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నాయి. తాజాగా, తమిళనాడు రాష్ట్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూపార్క్ లు, క్లబ్బులు, బార్ లు, రిసార్ట్స్ మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు తక్కువ మంది వెళ్లాలని సూచించారు.

More Telugu News