JC Diwakar Reddy: ఈ చట్టం ఒక్క వైసీపీకి తప్ప అందరికీ వర్తిస్తుంది: జేసీ దివాకర్​ రెడ్డి ఎద్దేవా

  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త చట్టంపై విమర్శలు
  • ఈ యాక్టుతో లాభం కన్నా నష్టమే ఎక్కువ
  • ఈ చట్టం అందరికీ వర్తిస్తే బాగుంటుంది
JC Diwaker Reddy criticises on new act for local body polls

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, ఈ చట్టంతో లాభం కన్నా నష్టమే ఎక్కువని అన్నారు. ఈ చట్టం ఒక్క వైసీపీకి తప్ప అందరికీ వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. డబ్బులు పంచినందుకు కేసు పెడితే తప్పులేదు కానీ ఎన్నికలు అయ్యాక కూడా కేసులు పెట్టాలన్న నిర్ణయం కరెక్టు కాదని అన్నారు. ఈ యాక్ట్ తీసుకొచ్చిన జగన్ కు ‘జేజేలు’ కొడుతున్నారని, అది అందరికీ వర్తిస్తే మంచిదే అని అన్నారు.

More Telugu News