Chinthamaneni Prabhakar: 200 కార్లతో అమరావతికి బయల్దేరిన చింతమనేని ప్రభాకర్

  • చలో అమరావతికి పిలుపునిచ్చిన చింతమనేని
  • గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • పోలీసుల కళ్లుగప్పి అమరావతికి పయనమైన చింతమనేని
Chintamaneni Prabhakar leaves to Amaravathi with 200 cars

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈరోజు 'చలో అమరావతి' పిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి 200 కార్లతో  అమరావతికి బయల్దేరారు. అంతకు ముందు అమరావతి బయల్దేరేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో, అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల కళ్లుగప్పి చింతమనేని అమరావతికి బయల్దేరడం విశేషం. మరోవైపు, మార్గమధ్యంలో ఆయనను ఎక్కడైనా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది.

More Telugu News