Andhra Pradesh: ఆందోళనలపై మాట్లాడదామని పిలిచి రాజధాని రైతుల అరెస్ట్!

  • ఏపీలో రాజధాని మార్పుపై నిరసనలు
  • రగులుతున్న అమరావతి
  • రైతుల ఆందోళనలు
  • తాజాగా 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. రాజధాని మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే కొందరు రైతులను పోలీసులు అరెస్ట్ చేయగా వారికి బెయిల్ లభించింది. పోలీసులు తాజాగా మరో 16 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఆందోళనలపై మాట్లాడదామని పిలిపించి వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్టయిన రైతులు వెలగపూడి, మందడం, మల్కాపురం గ్రామాలకు చెందినవారు.
Andhra Pradesh
Amaravati
Farmers
Police
YSRCP
Telugudesam
AP Capital

More Telugu News