కోహ్లీకి గాయం... తొలి టెస్టులో ఆడడంపై అనిశ్చితి!
- విండీస్ తో మూడో వన్డే సందర్భంగా కోహ్లీ చేతి వేలికి తగిలిన బంతి
- గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లీ
- గాయం తీవ్రమైంది కాదని వెల్లడి
- తొలి టెస్టులో ఆడతానని స్పష్టీకరణ
దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని, వేలి ఎముక విరగలేదని పరీక్షలో వెల్లడైందని తెలిపాడు. ఎముక విరిగివుంటే బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదని స్పష్టం చేశాడు. ఇది తేలికపాటి గాయమేనని, విండీస్ తో తొలి టెస్టులో తప్పకుండా ఆడతానని కోహ్లీ వివరించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సూపర్ సెంచరీ సాయంతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.