chigurupati: జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి నేరచరిత్రపై పోలీసుల ఆరా!

  • మోసాలు, సెటిల్ మెంట్లు చేయడంలో రాకేశ్ దిట్ట
  • అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించే వాడు
  • ఎమ్మెల్యే పేరు చెప్పి గతంలో డబ్బు వసూలు చేశాడు
ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి నేరచరిత్రపై పోలీసులు తీసిన ఆరాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మోసాలు, సెటిల్ మెంట్లు చేయడమే రాకేశ్ రెడ్డి తన వృత్తిగా పెట్టుకున్నట్టు తెలిసింది. అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించే వాడని, ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడంలో రాకేశ్ దిట్ట అని తెలిసింది. గతంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు వసూలు చేశాడని, ఈ కేసులో అతన్ని అప్పుడు పోలీసులు అరెస్టు చేశారు.
chigurupati
jayaram
criminal rakesh reddy

More Telugu News