తిరుమలకు పోటెత్తిన భక్తులు... నిన్న శ్రీవారి హుండీకి భారీ ఆదాయం
- తిరుమల శ్రీవారికి నిన్న రూ.5.63 కోట్ల హుండీ ఆదాయం
- స్వామివారిని దర్శించుకున్న 95,498 మంది భక్తులు
- సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం
- 21 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్న యాత్రికులు
- నిన్న ఒక్కరోజే 4.34 లక్షల లడ్డూల విక్రయం
తిరుమల గిరులపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. వారాంతం ముగిసినా రద్దీ తగ్గకపోవడంతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
సోమవారం నాడు 30,231 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీ నిన్న మొత్తం 4.34 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించింది. అదేవిధంగా, 2.58 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించగా, 3,172 మందికి వైద్య సేవలు అందజేశారు.