పరిపూర్ణానందను వెంటనే ఢిల్లీకి రావాలని కోరిన అమిత్ షా!
- బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు
- ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం
- బీజేపీ ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం
కాగా, పది రోజుల క్రితం అమిత్ షాతో పరిపూర్ణానంద సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ధిగా పరిపూర్ణానందను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. అమిత్ షా ఆదేశాల మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పరిపూర్ణానంద వ్యాఖ్యానించడం గమనార్హం. దసరా తరువాత మళ్లీ కలుద్దామని అమిత్ షా చెప్పడం, మరోసారి పిలుపు రావడంతో నేడు లేదా రేపు పరిపూర్ణానంద న్యూఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.