ముఖ్యమంత్రి కంటే ఒక రోజు ముందే మెడికల్ కాలేజీని ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ.. కేసు నమోదు!
- త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు
- సీఎం ప్రారంభించాల్సిన కాలేజీని ఎంపీ ప్రారంభించిన వైనం
- రెండోసారి ప్రారంభించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్రెడిట్ కొట్టేయాలని భావించిన ఎంపీ.. అనుచరులతో కలిసి మంగళవారం తన నియోజకవర్గంలోని బంజిలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకుని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించేశారు. నిజానికి ఈ కళాశాలను బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించాల్సి ఉంది.
ఈ ఘటనపై భురియా మాట్లాడుతూ మంగళవారం మంచి రోజనే దానిని ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కాలేజీకి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే అనుమతులిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కాలేజీని ఎంపీ ప్రారంభించినట్టు తెలియగానే అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలేజీ అధికారుల ఫిర్యాదుతో భురియా సహా మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. కాగా, రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ మెడికల్ కళాశాలను బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోమారు ప్రారంభించడం విశేషం.