తిరుమల బ్రహ్మోత్సవాలు: ఆరు రోజుల పాటు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేత
- నేటి నుంచి 19వ తేదీ వరకు భక్తులకు నేరుగా క్యూలైన్లలోకి అనుమతి
- 14న అంకురార్పణతో ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- సర్వదర్శనానికి 24 గంటలు, కొనసాగుతున్న భారీ రద్దీ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ వరకు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తిరిగి ఈనెల 20న.. 21వ తేదీ దర్శనం కోసం టోకెన్లను జారీ చేయనుంది.
అయితే, సోమవారం నాటి టోకెన్ల కోసం ఆదివారం ఉదయం నుంచే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద భక్తులు బారులు తీరారు. టోకెన్ల నిలిపివేతపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేశారు. అనంతరం వారంతా తిరుమలకు ప్రయాణమయ్యారు. వరుస సెలవులు కూడా తోడవడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి
సెప్టెంబర్ 14న అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 15న ధ్వజారోహణంతో మొదలై 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. అధికమాసం కారణంగా ఈ ఏడాది సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఆదివారం నాటి సమాచారం ప్రకారం, సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుండగా, 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శనివారం ఒక్కరోజే 81,724 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా నమోదైంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రొటోకాల్ మినహా), వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
అయితే, సోమవారం నాటి టోకెన్ల కోసం ఆదివారం ఉదయం నుంచే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద భక్తులు బారులు తీరారు. టోకెన్ల నిలిపివేతపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆవేదన, నిరాశ వ్యక్తం చేశారు. అనంతరం వారంతా తిరుమలకు ప్రయాణమయ్యారు. వరుస సెలవులు కూడా తోడవడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి
సెప్టెంబర్ 14న అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 15న ధ్వజారోహణంతో మొదలై 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. అధికమాసం కారణంగా ఈ ఏడాది సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఆదివారం నాటి సమాచారం ప్రకారం, సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుండగా, 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శనివారం ఒక్కరోజే 81,724 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా నమోదైంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రొటోకాల్ మినహా), వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.