ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- అన్ని వర్గాలను ఏకం చేసే సామాజిక పండుగ అని వెల్లడి
- మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు
- రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు తొలగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి (సెప్టెంబరు 13) పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే వినాయకుడిని ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో కొలుస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, "వినాయక చవితి అనేది ఊళ్లు, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక వేడుక ఇది" అని వివరించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణానికి మేలు చేసినవారమవుతామని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆశీర్వదించాలని తాను గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, "వినాయక చవితి అనేది ఊళ్లు, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక వేడుక ఇది" అని వివరించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణానికి మేలు చేసినవారమవుతామని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆశీర్వదించాలని తాను గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో వివరించారు.