రచ్చ లేపడానికి రెడీ.. ఒక్క పోస్టుతో 'స్వయంభూ'పై అంచనాలు పెంచేసిన నిఖిల్
- 'స్వయంభూ' కోసం 175 రోజులు షూట్ చేశామన్న హీరో నిఖిల్
- సినిమాలో 2500 గ్రాఫిక్స్ షాట్లు ఉన్నాయని వెల్లడి
- 60 రోజుల పాటు వందలాది మందితో భారీ క్లైమాక్స్ చిత్రీకరణ
- త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్న హీరో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం 'స్వయంభూ'పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నిఖిల్ తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ పంచుకున్నారు. ఒకే సినిమా కోసం 175 రోజులు షూటింగ్ చేయడం, 2500 గ్రాఫిక్స్ షాట్లు ఉండటం తన కెరీర్లో ఇదే తొలిసారని ఆయన తెలిపారు. మంచి ప్రయత్నాలకు సమయం పడుతుందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఈ మేరకు నిఖిల్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "'స్వయంభూ' ఒక పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మంచి పనులకు సమయం పడుతుంది. మేము దాదాపు ఆ దశకు చేరుకున్నాం. ఒకే సినిమా కోసం 175 రోజులు షూట్ చేస్తానని, 2500 గ్రాఫిక్స్ షాట్లు ఉంటాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ... రచ్చ లేపడానికి రెడీ. త్వరలోనే విడుదల తేదీ ప్రకటన ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఇటీవల హీరోయిన్ సంయుక్త పుట్టినరోజు సందర్భంగా, ఆమె పోషిస్తున్న 'భూమి' పాత్రకు సంబంధించిన ఒక బీటీఎస్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా కోసం సంయుక్త ఎంతో ధైర్యంగా ఒక ప్రమాదకరమైన స్టంట్ చేశారని దర్శకుడు భరత్ కృష్ణమాచారి గతంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో చిత్రీకరించిన ఒక సన్నివేశంలో, కింద నది ప్రవహిస్తుండగా కేవలం ఒకే ఒక్క హార్నెస్ సాయంతో ఆమె రెండు రోజుల పాటు తాడుపై వేలాడుతూ పర్వతాన్ని అధిరోహించారని వివరించారు.
ఈ సినిమా కోసం హీరో నిఖిల్ కూడా వియత్నాం వెళ్లి మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రెండు చేతులతో కత్తి యుద్ధం చేయడంలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. కేవలం హీరో, హీరోయిన్లు మాత్రమే కాకుండా సినిమాలో నటించిన వందలాది మంది సహాయ నటీనటులకు కూడా వియత్నాం నుంచి వచ్చిన నిపుణులతో కత్తి యుద్ధంలో శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపు 60 రోజుల పాటు భారీ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వపు మూలాలతో, ఒక యోధుడి గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న 'స్వయంభూ' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మేరకు నిఖిల్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "'స్వయంభూ' ఒక పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మంచి పనులకు సమయం పడుతుంది. మేము దాదాపు ఆ దశకు చేరుకున్నాం. ఒకే సినిమా కోసం 175 రోజులు షూట్ చేస్తానని, 2500 గ్రాఫిక్స్ షాట్లు ఉంటాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ... రచ్చ లేపడానికి రెడీ. త్వరలోనే విడుదల తేదీ ప్రకటన ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఇటీవల హీరోయిన్ సంయుక్త పుట్టినరోజు సందర్భంగా, ఆమె పోషిస్తున్న 'భూమి' పాత్రకు సంబంధించిన ఒక బీటీఎస్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా కోసం సంయుక్త ఎంతో ధైర్యంగా ఒక ప్రమాదకరమైన స్టంట్ చేశారని దర్శకుడు భరత్ కృష్ణమాచారి గతంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో చిత్రీకరించిన ఒక సన్నివేశంలో, కింద నది ప్రవహిస్తుండగా కేవలం ఒకే ఒక్క హార్నెస్ సాయంతో ఆమె రెండు రోజుల పాటు తాడుపై వేలాడుతూ పర్వతాన్ని అధిరోహించారని వివరించారు.
ఈ సినిమా కోసం హీరో నిఖిల్ కూడా వియత్నాం వెళ్లి మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రెండు చేతులతో కత్తి యుద్ధం చేయడంలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. కేవలం హీరో, హీరోయిన్లు మాత్రమే కాకుండా సినిమాలో నటించిన వందలాది మంది సహాయ నటీనటులకు కూడా వియత్నాం నుంచి వచ్చిన నిపుణులతో కత్తి యుద్ధంలో శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపు 60 రోజుల పాటు భారీ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వపు మూలాలతో, ఒక యోధుడి గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న 'స్వయంభూ' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.