వైభవ్లాంటి ఒక్క బ్యాటర్నైనా తయారు చేశారా?.. పాకిస్థాన్కు వసీం అక్రమ్ చురకలు
- పీఎస్ఎల్పై వసీం అక్రమ్ తీవ్ర విమర్శలు
- పదేళ్లలో చెప్పుకోదగ్గ బ్యాటర్ వచ్చారా అని ప్రశ్న
- వైభవ్ సూర్యవంశీని పాకిస్థాన్కు ఉదాహరణగా చూపిన వైనం
- యువ బ్యాటర్లను తీర్చిదిద్దడంలో వ్యవస్థ విఫలమైందని వ్యాఖ్య
- క్లబ్ క్రికెట్ను పునరుద్ధరించాలని సూచన
పాకిస్థాన్ క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఓ టెస్టు సిరీస్లో ఓటమితో ముగిసేది కాదని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలను మార్చగల బ్యాటింగ్ ప్రతిభను పాకిస్థాన్ వ్యవస్థ తయారు చేయలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై ఆయన తీవ్ర ప్రశ్నలు సంధించారు.
పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు పూర్తయినా.. ఈ లీగ్ నుంచి అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ ఎందుకు బయటకు రాలేదని అక్రమ్ ప్రశ్నించారు. బౌలర్లను తయారు చేయడంలో లీగ్ కొంతమేర విజయవంతమైందని అంగీకరించిన ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్యాటర్లను మాత్రం తయారు చేయలేకపోయిందన్నారు.
“పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు అవుతోంది. ఈ లీగ్ నుంచి ఒక్క బ్యాటర్నైనా తయారు చేశామా? కొంతమంది బౌలర్లు వచ్చారు. కానీ చెప్పండి.. చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ప్రతిభను ఎవరినైనా తయారు చేశామా?” అని అక్రమ్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. చిన్న వయసులోనే సీనియర్ క్రికెట్లోకి దూసుకొచ్చిన సూర్యవంశీ తరహా బ్యాటింగ్ ప్రతిభ పాకిస్థాన్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. “14 ఏళ్ల సూర్యవంశీ లాంటి బ్యాటింగ్ ప్రతిభ మనం తయారు చేసినప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో మార్పు కనిపిస్తుంది” అని చెప్పారు.
అక్రమ్ విమర్శలు పీఎస్ఎల్కే పరిమితం కాలేదు. దేశవాళీ వ్యవస్థను బలోపేతం చేయాలని, క్లబ్ క్రికెట్ను తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. కరాచీ, లాహోర్లో ప్రతిచోటా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టాలని పీసీబీకి సూచించారు. ప్రతిభ గుర్తించేందుకు ఈ నగరాలే కీలకమని చెప్పారు. పునర్వ్యవస్థీకరించిన దేశవాళీ వ్యవస్థకు తరచూ మార్పులు చేయకుండా కనీసం మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సమయం ఇవ్వాలని కోరారు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యాలపైనా అక్రమ్ స్పందించారు. రాబిన్సన్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ పాకిస్థాన్ బ్యాటర్లు క్రీజులో కదలకుండా నిలబడుతున్నారని, ఫ్రంట్ ఫుట్ను ముందుకు తీసుకెళ్లడం లేదని అన్నారు. ధైర్యంగా ఆడాలంటే ముందుగా అవసరమైన ప్రతిభ ఉండాలని పేర్కొన్నారు.
పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు పూర్తయినా.. ఈ లీగ్ నుంచి అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ ఎందుకు బయటకు రాలేదని అక్రమ్ ప్రశ్నించారు. బౌలర్లను తయారు చేయడంలో లీగ్ కొంతమేర విజయవంతమైందని అంగీకరించిన ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్యాటర్లను మాత్రం తయారు చేయలేకపోయిందన్నారు.
“పీఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లు అవుతోంది. ఈ లీగ్ నుంచి ఒక్క బ్యాటర్నైనా తయారు చేశామా? కొంతమంది బౌలర్లు వచ్చారు. కానీ చెప్పండి.. చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ప్రతిభను ఎవరినైనా తయారు చేశామా?” అని అక్రమ్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. చిన్న వయసులోనే సీనియర్ క్రికెట్లోకి దూసుకొచ్చిన సూర్యవంశీ తరహా బ్యాటింగ్ ప్రతిభ పాకిస్థాన్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. “14 ఏళ్ల సూర్యవంశీ లాంటి బ్యాటింగ్ ప్రతిభ మనం తయారు చేసినప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో మార్పు కనిపిస్తుంది” అని చెప్పారు.
అక్రమ్ విమర్శలు పీఎస్ఎల్కే పరిమితం కాలేదు. దేశవాళీ వ్యవస్థను బలోపేతం చేయాలని, క్లబ్ క్రికెట్ను తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. కరాచీ, లాహోర్లో ప్రతిచోటా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టాలని పీసీబీకి సూచించారు. ప్రతిభ గుర్తించేందుకు ఈ నగరాలే కీలకమని చెప్పారు. పునర్వ్యవస్థీకరించిన దేశవాళీ వ్యవస్థకు తరచూ మార్పులు చేయకుండా కనీసం మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సమయం ఇవ్వాలని కోరారు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యాలపైనా అక్రమ్ స్పందించారు. రాబిన్సన్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ పాకిస్థాన్ బ్యాటర్లు క్రీజులో కదలకుండా నిలబడుతున్నారని, ఫ్రంట్ ఫుట్ను ముందుకు తీసుకెళ్లడం లేదని అన్నారు. ధైర్యంగా ఆడాలంటే ముందుగా అవసరమైన ప్రతిభ ఉండాలని పేర్కొన్నారు.