1980ల ట్రెండ్: అందరూ ఏఐ ఫొటోలు పెడుతుంటే.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే?

1980ల ట్రెండ్: అందరూ ఏఐ ఫొటోలు పెడుతుంటే.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే?

1980s trend While everyone is posting AI photos what did CM Chandrababu do
  • సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న 1980ల నాటి ఏఐ ఫొటోల ట్రెండ్
  • ఏఐకి బదులుగా తన అసలైన ఫొటోలను పంచుకున్న సీఎం చంద్రబాబు
  • 1980లలోని తన పాస్‌పోర్ట్ ఫొటో, ఏఎన్ఆర్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసిన సీఎం
  • మరోవైపు ఏఐ ఫొటోతో ట్రెండ్‌లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘1980ల ట్రెండ్’ పేరుతో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తమ 1980ల నాటి ఫొటోలను సృష్టించుకుని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నంగా పాలుపంచుకున్నారు. ఏఐ ఫొటోలకు బదులుగా 1980ల నాటి తన అసలైన ఫొటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

నిన్న‌ తన సోషల్ మీడియా ఖాతాలో చంద్రబాబు మూడు ఫొటోలను పంచుకున్నారు. అందులో ఒకటి తన యవ్వనంలో తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటో కాగా, మరొకటి సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటిది. ఇంకో ఫొటోలో తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న దృశ్యం ఉంది.

‘‘1980ల ట్రెండ్‌లో అసలైన వాటితో జతకలుపుతున్నాను. ఆ దశాబ్దానికి చెందిన నా కొన్ని నిజమైన ఫొటోలు ఇవి’’ అనే వ్యాఖ్యను ఈ పోస్టుకు జోడించారు. చంద్రబాబు తన పాత జ్ఞాపకాలను పంచుకోవడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

మరోవైపు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ మాత్రం ఈ ట్రెండ్‌ను అనుసరించారు. ఏఐ సాయంతో రూపొందించిన తన 1980ల నాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. 
Advertisement
Nara Chandrababu Naidu
1980s trend social media
Nara Lokesh AI photos
Chandrababu Naidu old photos
Akkineni Nageswara Rao
Chandragiri constituency

More Telugu News