పీఏ ఇంట్లో నగదు, బంగారం.. కాంగ్రెస్ పదవులకు మాజీ సీఎం రాజీనామా
- కాంగ్రెస్లోని రెండు పదవులకు హరీశ్ రావత్ రాజీనామా
- ఆయన పీఏ ఇంట్లో రూ.32 లక్షల నగదు స్వాధీనం
- 200.5 గ్రాముల బంగారం, 12 ఖరీదైన వాచ్లు స్వాధీనం చేసుకున్న ఈడీ
- కుటుంబ ఖాతాల్లోని రూ.52.16 లక్షలను స్తంభింపజేసిన అధికారులు
- 2016 పరీక్ష అక్రమాలపై ఈడీ దర్యాప్తు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడు చందన్ సింగ్ జీనా ఇంట్లో ఈడీ సోదాలు జరిపిన నేపథ్యంలో కాంగ్రెస్లోని రెండు పదవులకు రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి పదవిని వదులుకున్నారు.
జీనా ఇంట్లో ఈడీ రూ.32 లక్షల లెక్కల్లో చూపని నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకుంది. దాదాపు 200.5 గ్రాముల బంగారం, 12 లగ్జరీ వాచ్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది. రోలెక్స్, రాడో, పియాజే, మొవాడో, టిస్సాట్ వంటి బ్రాండ్ల గడియారాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది.
జీనా, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలను కూడా ఈడీ స్తంభింపజేసింది. జీనా ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది.
2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రామ పంచాయతీ వికాస్ అధికారి పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఓఎంఆర్ జవాబు పత్రాల్లో అక్రమంగా మార్పులు చేసినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల ద్వారా అక్రమంగా డబ్బు చేతులు మారినట్లు పేర్కొంది.
తన పీఏపై వచ్చిన ఆరోపణలను నమ్మడం లేదని రావత్ చెప్పారు. అయితే ఆరోపణలు నిజమని తేలితే అలాంటి చర్యను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు.
తనతో సంబంధం ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరచకూడదని భావించి పదవుల నుంచి తప్పుకొన్నట్లు రావత్ తెలిపారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల వాతావరణం మొదలవుతున్న సమయంలో తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
జీనా ఇంట్లో ఈడీ రూ.32 లక్షల లెక్కల్లో చూపని నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకుంది. దాదాపు 200.5 గ్రాముల బంగారం, 12 లగ్జరీ వాచ్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది. రోలెక్స్, రాడో, పియాజే, మొవాడో, టిస్సాట్ వంటి బ్రాండ్ల గడియారాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది.
జీనా, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలను కూడా ఈడీ స్తంభింపజేసింది. జీనా ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది.
2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రామ పంచాయతీ వికాస్ అధికారి పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఓఎంఆర్ జవాబు పత్రాల్లో అక్రమంగా మార్పులు చేసినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తుల ద్వారా అక్రమంగా డబ్బు చేతులు మారినట్లు పేర్కొంది.
తన పీఏపై వచ్చిన ఆరోపణలను నమ్మడం లేదని రావత్ చెప్పారు. అయితే ఆరోపణలు నిజమని తేలితే అలాంటి చర్యను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు.
తనతో సంబంధం ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరచకూడదని భావించి పదవుల నుంచి తప్పుకొన్నట్లు రావత్ తెలిపారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల వాతావరణం మొదలవుతున్న సమయంలో తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.