"ఒక్క మెతుకు పొలిమేర దాటదు".. 'రణబాలి'గా గర్జించిన విజయ్ దేవరకొండ.. పవర్ ఫుల్ టీజర్ ఇదిగో!
- విడుదలైన విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్
- బ్రిటిష్ కాలం నాటి కరవు నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా
- గూస్బంప్స్ తెప్పిస్తున్న విజయ్ మాస్ డైలాగ్, ఎంట్రీ
- రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం
- దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా విడుదల
రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత తన అభిమానులు కోరుకుంటున్న అసలైన మాస్ అవతారంలోకి మారిపోయారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
టీజర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా, ఉత్కంఠగా సాగింది. బ్రిటిష్ పాలనలో 'అన్నపూర్ణ దేశం' ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు, గుప్పెడు గింజల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు హృదయాలను కదిలించాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఎంట్రీ, ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ టీజర్కే హైలైట్గా నిలిచాయి. "సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్కా..!! ఆ కొండమీదున్న మా భద్ర మల్లన్న మీద ఆనా.. నేను కాయలి కాస్తుండగా.. ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటదు చెబుతున్నా" అంటూ విజయ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, పాత్రలో లీనమైన తీరు మునుపటి చిత్రాలకు భిన్నంగా ఉన్నాయి.
1854-1878 మధ్య కాలంలో, ముఖ్యంగా 1876-78లో వచ్చిన భయంకరమైన కరవు నేపథ్యంలో ఈ చిత్రం వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్నట్టు టీజర్ స్పష్టం చేసింది. "సముద్రాలు దాటి వచ్చిన రాకాసులు కరవు రాక్షసులుగా మారితే.. ఆకలితో చనిపోయిన 80 లక్షల మంది ఆవేశాన్ని సమాధి చేయలేరు" వంటి వాక్యాలు కథలోని తీవ్రతను, పోరాట స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. భారీ సెట్లు, యాక్షన్ ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. టీజర్తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవడంతో, విజయ్ కెరీర్లో 'రణబాలి' ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
టీజర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా, ఉత్కంఠగా సాగింది. బ్రిటిష్ పాలనలో 'అన్నపూర్ణ దేశం' ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు, గుప్పెడు గింజల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు హృదయాలను కదిలించాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఎంట్రీ, ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ టీజర్కే హైలైట్గా నిలిచాయి. "సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్కా..!! ఆ కొండమీదున్న మా భద్ర మల్లన్న మీద ఆనా.. నేను కాయలి కాస్తుండగా.. ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటదు చెబుతున్నా" అంటూ విజయ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, పాత్రలో లీనమైన తీరు మునుపటి చిత్రాలకు భిన్నంగా ఉన్నాయి.
1854-1878 మధ్య కాలంలో, ముఖ్యంగా 1876-78లో వచ్చిన భయంకరమైన కరవు నేపథ్యంలో ఈ చిత్రం వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్నట్టు టీజర్ స్పష్టం చేసింది. "సముద్రాలు దాటి వచ్చిన రాకాసులు కరవు రాక్షసులుగా మారితే.. ఆకలితో చనిపోయిన 80 లక్షల మంది ఆవేశాన్ని సమాధి చేయలేరు" వంటి వాక్యాలు కథలోని తీవ్రతను, పోరాట స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. భారీ సెట్లు, యాక్షన్ ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. టీజర్తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవడంతో, విజయ్ కెరీర్లో 'రణబాలి' ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.