తెలంగాణలో రాజకీయ వేడి.. హౌస్ అరెస్టులపై బీజేపీ ఆగ్రహం

తెలంగాణలో రాజకీయ వేడి.. హౌస్ అరెస్టులపై బీజేపీ ఆగ్రహం

BJP angry over house arrests as political heat rises in Telangana
  • అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ
  • రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల హౌస్ అరెస్ట్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలే ప్రధాన డిమాండ్
  • ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామంటున్న కమలదళం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై పలువురు కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22ఏ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. 'ఫీజు బకాయి-బీజేపీ లడాయి'లో భాగంగా 'చలో ఇందిరాపార్క్' కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

అనుమతి లేనప్పటికీ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు సిద్ధమవడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం తదితర జిల్లాల్లో బీజేపీ, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సభ లోపల, వెలుపల ఎండగడతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. శాంతియుత నిరసనలను కూడా ప్రభుత్వం అణచివేస్తోందని, ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. 
Advertisement
BJP
Telangana Assembly
House arrest
Fee reimbursement
N Ramachander Rao
BJP protests Telangana

More Telugu News