విజయసాయిరెడ్డిని కేఏ పాల్ తో పోల్చిన బొత్స
- వైసీపీలో సజ్జల నెంబర్ 1, జగన్ నెంబర్ 2 అంటూ విజయసాయి వ్యాఖ్యలు
- ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
- విజయసాయి రెడ్డిని కేఏ పాల్తో పోల్చుతూ ఘాటు విమర్శ
- ఆయన వ్యాఖ్యలతో సమయం వృథా చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచన
- విజయసాయి వ్యాఖ్యలతో వైసీపీలో బయటపడిన అంతర్గత విభేదాలు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 1 అని, జగన్ నెంబర్ 2 అని ఆయన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విజయసాయి రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆయన మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. ఇంతకుముందు మనకు కేఏ పాల్ ఒకరు ఉండేవారు, ఆయన ఏదేదో మాట్లాడుతుండేవారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రెండో వ్యక్తిగా తయారయ్యారు. ఆయన మాటలకు విలువ ఇచ్చి స్పందించడం అంటే మన సమయాన్ని మనం వృథా చేసుకోవడమే.
చూడండి, శుభ్రంగా సాయంత్రం వేళ ప్రశాంతంగా కూర్చున్నాం. ఇలాంటి సమయంలో ఆ పనికిమాలిన మాటల గురించి ఎందుకు మాట్లాడాలి? దానివల్ల నా సమయం వృథా అవ్వడమే కాకుండా, అసలు విషయాలైన ప్రజా సమస్యల నుంచి మన దృష్టి మళ్లుతుంది. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, ఇలాంటి వాటి కోసం కాదు.
ఆయనకేదో అది పెద్ద విషయంలా అనిపిస్తే, దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టుకోమనండి. బహిరంగంగా చెప్పుకోమనండి. అంతేగానీ, దానికోసం మేం సమయం కేటాయించం. అనవసరంగా ఇలాంటి విషయాల గురించి చర్చించి మన విలువైన సమయాన్ని పాడుచేసుకోవడం ఎందుకు? కాబట్టి, ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ అడిగి మీ సమయం, నా సమయం వృథా చేయొద్దని కోరుతున్నాను" అని బొత్స పేర్కొన్నారు.
"విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆయన మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. ఇంతకుముందు మనకు కేఏ పాల్ ఒకరు ఉండేవారు, ఆయన ఏదేదో మాట్లాడుతుండేవారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రెండో వ్యక్తిగా తయారయ్యారు. ఆయన మాటలకు విలువ ఇచ్చి స్పందించడం అంటే మన సమయాన్ని మనం వృథా చేసుకోవడమే.
చూడండి, శుభ్రంగా సాయంత్రం వేళ ప్రశాంతంగా కూర్చున్నాం. ఇలాంటి సమయంలో ఆ పనికిమాలిన మాటల గురించి ఎందుకు మాట్లాడాలి? దానివల్ల నా సమయం వృథా అవ్వడమే కాకుండా, అసలు విషయాలైన ప్రజా సమస్యల నుంచి మన దృష్టి మళ్లుతుంది. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, ఇలాంటి వాటి కోసం కాదు.
ఆయనకేదో అది పెద్ద విషయంలా అనిపిస్తే, దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టుకోమనండి. బహిరంగంగా చెప్పుకోమనండి. అంతేగానీ, దానికోసం మేం సమయం కేటాయించం. అనవసరంగా ఇలాంటి విషయాల గురించి చర్చించి మన విలువైన సమయాన్ని పాడుచేసుకోవడం ఎందుకు? కాబట్టి, ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ అడిగి మీ సమయం, నా సమయం వృథా చేయొద్దని కోరుతున్నాను" అని బొత్స పేర్కొన్నారు.