కలిసొచ్చిన అదృష్టం.. జపాన్ ఓపెన్లో సెమీస్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- ఒకుహారా వైదొలగడంతో సెమీస్కు సింధు
- ఈ సీజన్లో సింధుకు మూడో సెమీస్
- సెమీస్లో చెన్ యుఫెయీతో పోరు
- గెలిస్తే మూడేళ్ల తర్వాత సూపర్ 750 ఫైనల్
- టోర్నీలో భారత్ ఆశలన్నీ సింధుపైనే
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్కు చేరుకుంది. క్వార్టర్ఫైనల్లో తలపడాల్సిన జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారా గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకోవడంతో సింధుకు నేరుగా సెమీస్ బెర్త్ లభించింది.
ఈ సీజన్లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్. అంతేకాదు 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్ 750 టోర్నీలో ఆమె తొలిసారి సెమీస్కు చేరుకుంది. ఈ సీజన్లో తొలి టైటిల్పై సింధు ఆశలు కొనసాగుతున్నాయి.
సెమీఫైనల్లో సింధు.. చైనా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయీతో తలపడనుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 14 మ్యాచ్లు జరిగాయి. సింధు ఆరు, యుఫెయీ ఎనిమిది మ్యాచ్లు గెలిచారు. గత ఐదు మ్యాచ్ల్లోనూ సింధుపై యుఫెయీదే పైచేయి కావడం గమనార్హం.
యుఫెయీని ఓడిస్తే సింధు దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్ 750 టోర్నీ ఫైనల్కు చేరుకుంటుంది. అంతేకాదు, వరుస ఓటముల పరంపరకు కూడా తెరపడుతుంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయేను 21-16, 21-14తో వరుస గేమ్ల్లో ఓడించి సింధు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది.
భారత్కు చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిలా-తనిషా క్రాస్టో ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా కూడా ఓటమి పాలైంది. దీంతో టోర్నీలో భారత్ ఆశలన్నీ ఇప్పుడు సింధుపైనే నిలిచాయి.
ఈ సీజన్లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్. అంతేకాదు 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్ 750 టోర్నీలో ఆమె తొలిసారి సెమీస్కు చేరుకుంది. ఈ సీజన్లో తొలి టైటిల్పై సింధు ఆశలు కొనసాగుతున్నాయి.
సెమీఫైనల్లో సింధు.. చైనా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయీతో తలపడనుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 14 మ్యాచ్లు జరిగాయి. సింధు ఆరు, యుఫెయీ ఎనిమిది మ్యాచ్లు గెలిచారు. గత ఐదు మ్యాచ్ల్లోనూ సింధుపై యుఫెయీదే పైచేయి కావడం గమనార్హం.
యుఫెయీని ఓడిస్తే సింధు దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్ 750 టోర్నీ ఫైనల్కు చేరుకుంటుంది. అంతేకాదు, వరుస ఓటముల పరంపరకు కూడా తెరపడుతుంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయేను 21-16, 21-14తో వరుస గేమ్ల్లో ఓడించి సింధు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది.
భారత్కు చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిలా-తనిషా క్రాస్టో ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా కూడా ఓటమి పాలైంది. దీంతో టోర్నీలో భారత్ ఆశలన్నీ ఇప్పుడు సింధుపైనే నిలిచాయి.